పాపన్నపేట,ఫిబ్రవరి,26,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు శ్రీశైలం వివాహం మమతతో గురువారం రామతీర్థం లో గ్రామంలో ఘనంగా జరిగిది.ఈ వివాహానికి మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మదేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి.తిరుపతిరెడ్డి, మండల నాయకులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఎరుకల.భూమయ్య కుమార్తె నిశ్చితార్థంకు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాల గౌడ్,పాపన్నపేట్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుమ్మరి. జగన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ గురుమార్తి గౌడ్, నాయకులు సోములు, దుర్గయ్య, బాబా గౌడ్,అంటోని,మాణిక్య రెడ్డి,చంద్రశేఖర్,నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

