📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSస్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కి 20% సీట్లు కేటాయించాలి.

స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కి 20% సీట్లు కేటాయించాలి.

📰 Generate e-Paper Clip

పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్‌ కు వినతిపత్రం అందజేసిన యువజన నాయకులు.

పటాన్‌చెరు, జనవరి 09:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ 20 శాతం సీట్లు కేటాయించాలని పటాన్‌చెరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుల నవీన్ ముదిరాజ్ కోరారు.శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పసుల నవీన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యువతకు ఎన్నికల్లో తగిన గుర్తింపు లభించినప్పుడే భవిష్యత్తు నాయకత్వం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ వినతిపై కాటా శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ, రానున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు సీట్లు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాటా శ్రీనివాస్ సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: మాజీ వార్డ్ మెంబర్ అమీన్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అశోక్,సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, పటాన్చెరు నియోజవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుల నవీన్ ముదిరాజ్,యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, సాయి గౌడ్,యువజన కాంగ్రెస్ నాయకులు ఉమార్,మరియు ఇతర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments