పాపన్నపేట,డిసెంబర్,8, మెదక్ టుడే న్యూస్: పాపన్నపేటగ్రామపంచాయతీ సర్పంచ్ గా తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాపన్నపేట సర్పంచ్ అభ్యర్థి లింగంపేట పావని నరేందర్ గౌడ్ అన్నారు.సోమవారం ఆయా వార్డులో ఇంటింటికి వెళ్లి తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం
నిరంతరం శ్రమిస్తానని వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.వార్డు సభ్యులుగా పంచాయతీ పాలకవర్గంలో గ్రామ ప్రజలకుఅందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక సదుపాయాలను కల్పిస్తానని తెలిపారు.గ్రామంలోని వ్యక్తిగతంగా ప్రతి ఓటర్లను కలుస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.తన కు కేటాయించిన బ్యాటు గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించగలరని ప్రచార జోరు పెంచుతూ వేడుకుంటున్నారు.
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాపాపన్నపేట సర్పంచ్ అభ్యర్థి లింగంపేట పావని నరేందర్ గౌడ్..
RELATED ARTICLES
