📄 ePaper
Thursday, March 12, 2026
ADS
HomeUncategorizedజిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా...

జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..

📰 Generate e-Paper Clip

మెదక్, నవంబర్, 11, మెదక్ టుడే న్యూస్:

•జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు భద్రతా చర్యలలో భాగంగా బీడీ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు..

జిల్లా పోలీస్ అధికారి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యల భాగంగా బీడీ టీమ్‌ మరియు డాగ్ స్క్వాడ్‌ సిబ్బంది సంయుక్తంగా న్యూ బస్ స్టాప్‌, ఓల్డ్ బస్ స్టాప్‌, రైల్వే స్టేషన్‌ మరియు చర్చి ప్రాంతాలలో చెకింగ్‌ నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లగేజీలు మరియు వస్తువులపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను నిరోధించడం ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.అదే విధంగా, గత ఐదు రోజులుగా గుల్షన్ క్లబ్ దగ్గర రోడ్డు పక్కన ఒక వాహనం ఆగి ఉండగా, అది ఉపయోగించకుండా ఉండడం వల్ల అనుమానాస్పదంగా కనిపించిందని ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో, మెదక్ టౌన్ సీఐ శ్రీ మహేష్ గారు వెంటనే స్పందించి బీడీ టీమ్‌ను ఘటన స్థలానికి తీసుకొని వచ్చారు.బీడీ టీం సిబ్బంది ఆ వాహనాన్ని అన్ని కోణాల్లో తనిఖీ చేసిన అనంతరం ఆ వాహనంలో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లేవని నిర్దారించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రజల భద్రత పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యం అని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌ లేదా డయల్‌ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్, ఆర్‌ఎస్ఐ సుభాష్, బీడీ టీమ్‌ నర్సింలు, డాగ్ స్క్వాడ్‌ శ్రావణి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments