అమీన్పూర్,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు.ఈ వేడుకలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మరియు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమ కాలనీలో నల్ల పోచమ్మ తల్లి దేవాలయం ఉండడం తమ అదృష్టమని, అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులగా గట్టి నమ్మకం ఉందన్నారు. అందరి సహకారంతో ఒక చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయాన్ని నేడు అందమైన దేవాలయంగా నిర్మించుకోగలిగామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా, శారీరకంగా సహకరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి, మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్కు, మాజీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు మరియు ప్రతి ఒక్క లీడర్కు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ ప్రెసిడెంట్ ఎం మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ గోపి, రాఘవేంద్ర కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..




