కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమంతరావు.
పాపన్నపేట,జూన్,13,(మెదక్ టుడే న్యూస్)మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా పేద ప్రజలకు సేవా చేస్తున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. నీటి సమస్యల పరిష్కారానికి వేల బోర్లు వేసినట్లు ఆయన గుర్తు చేశారు.శనివారం మండలం లోని ఎల్లాపూర్,కుర్తివాడ పలు గ్రామాల్లో బోర్లకు మోటర్లు సామాగ్రి అందజేసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్,ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి,మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,కిసాన్ సెల్ నాయకులు ప్రభాకర్ రెడ్డి,జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు శ్రీధర్, మండలాధ్యక్షుడు నీరుడి వెంకటేశం,జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్,నాయకులు కిష్టయ్య,గౌస్,ఖలీమ్, ముశెట్టి కిష్టయ్య, దోసని సంగమేశ్వర్,కుమ్మరి శంకరయ్య,ఏసు,అంజి, శ్రీశైలం,చోటు, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


