•పేటలో విచిత్ర .. పంచాయితీ .!?
పాపన్నపేట,డిసెంబర్,5,మెదక్ టుడే న్యూస్:
మండల కేంద్రం పాపన్నపేటలో విచిత్ర గ్రామ పంచాయితీ నెలకొంది .!? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా ఇద్దరు వ్యక్తులు ఒకే పార్టీ కండువాలతో ప్రచారం నిర్వహించడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కరికీ మాత్రమే కండువాలతో ప్రచారం నిర్వహించే అవకాశం కల్పిస్తే ప్రజల ఈ అయోమయానికి తెర తీసినట్టు అవుతుంది. 14 వార్డులు ఉండగా ఇప్పటికే ఒక వార్డు ఏకగ్రీవం అయింది. మిగిలిన 13 వార్డులతో పాటు సర్పంచ్ స్థానానికి ఈనెల 11 ఎన్నిక జరగనుంది.
