మెదక్, నవంబర్, 12, మెదక్ టుడే న్యూస్:
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్.
•అన్ని సెంటర్లలో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచాలి.
•అన్ని మీల్స్ వద్ద ఒక రెవెన్యూ అధికారి ద్వారా పర్యవేక్షణ.
•కలెక్టరేట్లో కొనుగోలు కేంద్ర నిర్వాహణపై అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి సివిల్ సప్లై మార్కెటింగ్, వ్యవసాయ, సహకార శాఖ, డి ఆర్ డి ఏ, అధికారులతో కలెక్టర్ సమీక్ష
జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేస్తూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, జిల్లాలో
ప్రస్తుతం వాతావరణ అనుకూల ప్రభావంగా ఉన్నందున కొనుగోలు వేగం పుంజుకుని రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. 69 రైస్ మిల్లుల వద్ద ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమించి లారీల దిగుమతి పర్యవేక్షణ చేసే విధంగా కార్యాచరణ తయారు చేయాలన్నారు..
అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం
స్టాక్ ఉన్న టార్పలిన్ వివరాలను సమగ్ర సమాచారంతో ఫార్మాట్ రూపొందించాలన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలను పెంచి వేగంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్స్ ఉన్న మండలాలలో రైతులు ధాన్యం శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా లారీల విషయంలో సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. సీఎంఆర్ పెండింగ్ విషయంలో పౌరసరఫరాల అధికారులు దృష్టి సారించాలన్నారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్, డిఎం సివిల్ సప్లై జగదీష్, మార్కెటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
