📄 ePaper
Thursday, March 12, 2026
ADS
HomeUncategorizedప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్ పి...

ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్ పి . శ్రీనివాసరావు..

📰 Generate e-Paper Clip

ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ . శ్రీనివాసరావు,

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమంలో బాగంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీ గారికి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలి. చట్టబద్ధ మార్గంలోనే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ప్రజల భద్రత, శాంతి కాపాడటం మరియు వారితో మరింత దగ్గరగా ఉండటం ప్రధాన లక్ష్యం అని అన్నారు.అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వేగవంతంగా పరిష్కరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments