📄 ePaper
Thursday, March 12, 2026
ADS

📰 Generate e-Paper Clip

లోక్ అదాలత్ – ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి విలువైన అవకాశం.

•లోక్ అదాలత్ – ప్రజలకు త్వరగా న్యాయం అందించడానికి విలువైన అవకాశం.

•స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి రాజీయే రాజమార్గం.

•జిల్లా ఎస్ పి. డి. వి. శ్రీనివాస రావు ఐపీ ఎస్.

మెదక్, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా ఎస్ పి శ్రీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్  ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడుతు,
లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు.రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు అని వివరించారు.మెదక్ జిల్లా ఎస్ పి ప్రజలకు సూచిస్తూ,చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, రాజీ అంటే విజయం వైపు దారితీసే నిజమైన మార్గమాని పేర్కొన్నారు.న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎస్ పి సూచించారు.అదే విధంగా జిల్లా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.తమ కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను సంప్రదించాలని ఎస్ పి సూచించారు.లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరిత న్యాయం అందుతుందని ఎస్ పి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments