📄 ePaper
Thursday, March 12, 2026
ADS
HomeUncategorizedఅందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం.వారి అకాల మరణం పట్ల...

అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం.వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్..

📰 Generate e-Paper Clip

(స్టేట్ బ్యూరో) మెదక్ టుడే న్యూస్:

అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం…వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్. ప్రముఖ కవి‘జయ జయ హే తెలంగాణ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments