📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
Homecollector MEDAKఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ రాహుల్...

ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,ఫిబ్రవరి,13,మెదక్ టుడే న్యూస్:భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని,ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఏడుపాయల జాతర ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,భక్తులకు అసౌకర్య కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ట్రాఫిక్, త్రాగునీరు, పార్కింగ్ పార్కింగ్, సంస్కృతిక కార్యక్రమాలు, దర్శన ఏర్పాట్లు , ఇతర పెండింగ్లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను ప్రశాంతంగా ముగించాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీరేశం,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments