📄 ePaper
Friday, September 11, 2026
ADS
HomeNewsయూరియా కోసం అన్నదాతల పడిగాపులు!

యూరియా కోసం అన్నదాతల పడిగాపులు!

📰 Generate e-Paper Clip

సర్వర్‌ సమస్యలతో పాపన్నపేటలో రైతుల అవస్థలు.. పాదరక్షలతో క్యూ

పాపన్నపేట,సెప్టెంబర్,2,మెదక్ టుడే న్యూస్:
యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.యాప్‌, సర్వర్‌ సమస్యల కారణంగా యూరియా కోసం పాపన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాశారు.బుధవారం రైతులు తమ పాదరక్షలను క్యూ లైన్‌లో పెట్టి, కార్యాలయ భవనం నీడలో వేచి ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.యూరియా కోసం రైతులను ఇలా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.యూరియా సరఫరాలో సమస్యలు లేకుండా, సర్వర్‌ లోపాలను వెంటనే పరిష్కరించి రైతులకు సకాలంలో ఎరువు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular