ప్రతి గ్రామానికి కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు
పాపన్నపేట,సెప్టెంబర్,2,మెదక్ టుడే న్యూస్:స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు.ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. బుధవారం పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలను పేదలకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


