పాపన్నపేట,ఫిబ్రవరి,1, మెదక్ టుడే న్యూస్:ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. ఆదివారం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని వనదుర్గా క్షేత్రంలో పల్లకీ సేవా వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకీ లో ప్రతిష్టించి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు శంకర్ శర్మ అమ్మవారి కీ ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి దుర్గమ్మ ను దర్శించుకున్నారు.

