MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 3:59 am Digital Edition : Shiva Kumar

వల్లూరు గ్రామ ప్రజలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రస్తారోకో.

చేగుంట,మే,26,మెదక్ టుడే న్యూస్:నార్సింగ్ మండలం వల్లూరు గ్రామ ప్రజలు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ వల్లూరు గ్రామస్తులు మంగళవారం జాతీయ రహదారి 44 పై ఆందోళనకు దిగారు ప్రమాదకరంగా మారిన క్రాసింగ్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు గ్రామస్తులు ఆందోళనతో హైదరాబాద్ కామారెడ్డి వైపు భారీగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న నార్సింగ్ ఎస్సై సృజన సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకొచ్చారు.అధికారులు అధికారులతో చర్చించి మీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.