MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 2:03 pm Digital Edition : Medak Today

వైద్య శిబిరం పరిశీలన..

పాపన్నపేట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా వైద్యాధికారి శ్రీరాం సూచించారు. బుధవారం పొడ్చన్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించారు. వివిధ చికిత్స గూర్చి 221 మంది రోగులు ఈ శిబిరానికి తరలి వచ్చారు. మెదక్ డివిజన్ ఇంచార్జి డిప్యూటీ డీఎం హెచ్ఓ హరిప్రసాద్,వైద్యాధికారులు దీక్ష,ప్రదీప్ రావు,నవ్య,సిబ్బంది అలీ,ఇందిరా ఉన్నారు.