MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 3:51 am Digital Edition : Shiva Kumar

వడియారం పెద్దమ్మ దేవాలయానికి ధూప దీప నైవేద్యానికి 5000 రూపాయలు.

ఉప సర్పంచ్ గా ఉన్నంతకాలం ప్రతినెల 5000 రూపాయలు ఇస్తాను మహమ్మద్ రఫీ

చేగుంట,మే,21,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పెద్దమ్మ దేవాలయానికి రంగుల నిమిత్తం చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ (2,11,000 )రూపాయలు రెండు లక్షల పదకొండు వేల రూపాయలు అందజేశారు. అలాగే ధూప దీప నైవేద్యానికి ప్రతినెల 5000 రూపాయలు ఇస్తానని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ అన్నారు. నేను ఉపసర్పంచ్ గా ఉన్నంతకాలం ఇస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఘనమైన పాండు మామిండ్ల బాలయ్య,పున్న యాదగిరి, మొగిలి నరసింహులు నరసింహులు,మహేందర్ డీలర్ రామచంద్రo తదితరులు పాల్గొన్నారు.