MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 4:07 am Digital Edition : Shiva Kumar

వారం రోజులైనా లారీలు లేవు.

-పట్టించుకోని అధికారులు

-అంసాన్ పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల రైతుల ఆవేదన

-రెండు రోజులలో తూకం వేసిన బస్తాలను రైస్ మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తా: తహసిల్దార్ శ్రీనివాస చారి

    కొల్చారం,మే,21,(మెదక్ టుడే న్యూస్)ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసి వారం రోజులు గడిచిన కూడా లారీలు రావడం లేదని అంసాన్ పల్లి పోతిరెడ్డిపల్లి కొంగోడు గ్రామాల రైతులు గురువారం తాసిల్దార్ శ్రీనివాస చారిని, ఎస్సై మహమ్మద్ మొయినుద్దీన్ లను కలిసి మొరపెట్టుకున్నారు. సకాలంలో లారీలు పంపాలని ఆ గ్రామాల రైతులు తహసిల్దార్ నువేడుకొన్నారు.తహసిల్దార్ శ్రీనివాస చారి ఇచ్చిన హామీ,ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసచారి మాట్లాడుతూ రెండు రోజులలో తప్పకుండా లారీలు పంపించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా అధికారులతో సహకరించాలని కోరారు. రైతుల వద్ద ట్రాక్టర్లు ఇతర సొంత ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉంటే ఉపయోగించుకోవాలని సకాలంలో అన్లోడ్ చేసే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం అంసానిపల్లి సొసైటీ చైర్మన్ మన్నే రాములు, సర్పంచులు స్వామి, గీతా రమేష్, ఉప సర్పంచులు , రైతులు తదితరులు పాల్గొన్నారు.