చేగుంట,మార్చి,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం ప్రాథమిక పాఠశాలకు సంతోషిమాత టీచర్ సౌండ్ బాక్స్ బహుకరించడం జరిగింది. ఇటీవల నిర్వహించిన పదోన్నతులలో వడియారం ప్రాథమిక పాఠశాల నుండి రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలకు వెళ్లిన సంతోషిమాత టీచర్, వడియారం పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడే సౌండ్ బాక్స్ ఇచ్చినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంత, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
