MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:24 pm Digital Edition : Medak Today

వడియారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభం.

చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:జన గణన 2027 లో భాగంగా ఈరోజు చేగుంట మండలంలోనివడియారం గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ లో ఎన్యుమరేటర్స్ మరియు సూపర్వైజర్లకు మొదటి బ్యాచ్కు శిక్షణ తరగతులు ప్రారంభం అయినదని తెలియజేశారు.ఈ శిక్షణా తరగతుల ను ఆర్డిఓ పర్యవేక్షించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో మాట్లాడుతూ ఏ న్యూమరేటర్లకు సూపర్వైజర్లకు హౌస్ లిస్టింగ్ కు సంబంధించిన కొన్ని సూచనలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా డిఎఫ్ఓ మాట్లాడుతూ జనగణన 2027 యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది.మండల చార్జ్ ఆఫీసర్ కే శివ ప్రసాద్ మాట్లాడుతూ జన గణనలో సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. మొదటి బ్యాచ్ కు సంబంధించిన శిక్షణా తరగతులు 18, 20,21, తేదీలలో జరుగుతాయి.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ మేడం ,ట్రైనర్స్గా సిహెచ్ లక్ష్మణ్ మరియు మల్లేశం ఏ ఎస్ ఓ భూమేష్ oపాల్గొనడం జరిగింది