MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 9:32 am Digital Edition : Medak Today

వడియారం గ్రామంలో వినాయక స్టీల్ ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ప్రారంభించిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్.

చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని వినాయక స్టిల్స్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ప్రారంభించిన స్థానిక సర్పంచ్ సాయికుమార్ గౌడ్. సర్పంచ్ మాట్లాడుతూ,ఈ వేసవికాలంలో నీరు చాలా ముఖ్యమైనది మా గ్రామానికి వినాయక స్టీల్ వాళ్లు ఇక్కడ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషకరంగా ఉన్నది ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర పెట్టడం వలన ప్రజలకు చాలా సౌకర్యం కరంగా ఉన్నది ఇలా పెట్టినందుకు వినాయక స్టీల్ కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదములు అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ సర్పంచ్ నాగరాజు పాలకవర్గ సభ్యు లు,గ్రామ ప్రజలు,వినాయక్ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్ హెడ్ శ్రీనివాసాచార్యులు,మేనేజర్ స్వామి గౌడ్, కంపెనీ సిబ్బంది, పాల్గొనడం జరిగింది