చేగుంట,మార్చి,27,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో శాంతి సౌభాగ్యo అభివృద్ధి అందించాలని శివపంచాయత నా ఆలయ కమిటీ గ్రామ పాలకవర్గం మన ప్రజల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం హనుమాన్ గుడి దగ్గర నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.కళ్యాణం రంగ రంగ వైభవంగా జరిగిన అనంతరం అన్న ప్రసాదన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం వడియారం గ్రామస్తులు దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పాలకవర్గ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా శ్రీ సీతారాముల యొక్క శోభయాత్ర నిర్వహించడం జరిగినది శోభాయాత్రలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రామ కీర్తనలు చేస్తూ భజన చేస్తూ శోభాయాత్ర నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో శివ పంచాయతన కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు యువజన సంఘ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది