MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 12:07 am Digital Edition : Medak Today

వడియారం గ్రామంలో పరాభవ నూతన సంవత్సర ఉగాది వేడుకలు.

చేగుంట,మార్చి,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో( హనుమాన్ గుడి)శివ పంచాయతన దేవాలయంలో గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురోహితుడువెంకటేశ్వర శర్మ తో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. ఈ ఉగాది పండుగను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ మా వడియారం గ్రామ పురోహితుడు అయిన వెంకటేశ్వర శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించాము పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరానికి సంబంధించిన శుభ ఫలితాలను వివరించారు.గ్రామానికి మంచి కాలం ప్రారంభమవుతుందని,అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని తెలిపారు.అనుకూలమైన వర్షపాతం ఉండి వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటుందని, ప్రజలు ఆరోగ్యంగా,జీవిస్తారని గ్రామంలో ఐకమత్యం కొనసాగితే మరింత పురోగతి సాధ్యమని,ఈ ఉగాది కొత్త ఆశలు, కొత్త అవకాశాలకు నాంది పలుకుతుందని పంతులు చెప్పారు.అలాగే రాబోయే సంవత్సరం మా గ్రామంలో పాడి పశువులు అన్నదాతలు రైతులు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని,వడియారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామని గ్రామ పాలకవర్గం తరఫున తెలియజేస్తున్నాము అలాగే వచ్చే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకుందాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివ పంచాయతన దేవాలయ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, ప్రజలు యువకులు పాల్గొనడం జరిగినది.