MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 5:40 am Digital Edition : Medak Today

వడియారం గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గ్రామ పాలకవర్గం

చేగుంట, జనవరి, 30, మెదక్ టుడే న్యూస్,చేగుంట మండలo వడియారం గ్రామంలో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన ఉప సర్పంచ్ బండారి నాగరాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకన్న గారి వెంకట గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వల్లనే మనకు స్వాతంత్రం వచ్చిందని అహింసా మార్గం ద్వారా తెచ్చాడని స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంకన్న గారి వెంకట గౌడ్, ఉపసర్పంచ్ బండారి నాగరాజు వార్డ్ మెంబర్లు గయా సుద్దీన్, శ్రావణ్ కుమార్, అనిల్ కుమార్, జనార్దన్ గౌడ్, గ్రామ ప్రజలు మామిండ్ల నరేష్ , డప్పు మహేష్, రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు.