MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 10:58 am Digital Edition : Medak Today

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య…

పాపన్నపేట,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:మనస్థాపంతో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేస్తూ జీవితం సాగిస్తున్నాడు.కాగా వారం రోజుల క్రితం ఈయన పెద్ద కూతురు ఎంగేజ్ మెంట్ జరిగింది.దీంతో త్వరలో పెళ్లి ఉండడంతో పెళ్లికి డబ్బులు లేక అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు.అప్పు ఎక్కడ దొరక్కపోవడంతో మనస్థాపం చెందిన అతను శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతకగా ఆదివారం ఉదయం సమయంలో గ్రామ రోడ్డు పక్కన పాడుబడిన రైస్ మిల్లులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.