MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 12:31 am Digital Edition : Shiva Kumar

ఉద్యమ స్పూర్తికి ప్రతీకగా ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీకి ఘన సన్మానం.

ఉద్యమకారుల గుర్తింపే నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం,ప్రొఫెసర్ కోదండరాం
(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్‌నగర్,మే,20, మెదక్ టుడేన్యూస్:
తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన ప్రముఖ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ Professor Kodandaram ను తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. వెంకట్ రాంరెడ్డి (మాజీ జడ్పీటీసీ, ఫరూఖ్‌నగర్) ఆధ్వర్యంలో వారి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో తెలంగాణ ఉద్యమ కాలం, ఉద్యమకారుల పాత్ర, భవిష్యత్తులో వారికి లభించాల్సిన గుర్తింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ స్థాయిలో ఉద్యమం కోసం కష్టపడిన కార్యకర్తలు, విద్యార్థి నాయకులు, ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గుర్తించాలని నాయకులు కోరారు.దీనికి స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో భాగమైన ప్రతి ఉద్యమకారుడి సేవ అమూల్యమని, వారిని గుర్తించేందుకు సరైన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యమ స్ఫూర్తి నిలిచి ఉండాలంటే ఉద్యమకారులకు గౌరవం, గుర్తింపు కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పినపాక ప్రభాకర్, టీజీ శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కాదే సుధాకర్, కావాలి యాదగిరి, రవి గౌడ్, మేకల వెంకటేష్, సిద్దం విటలయ్య, దొడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.