MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 12:10 pm Digital Edition : SHIVA KUMAR

సీఎం ఆర్ ఫ్ .. పేదలకు వరం

పాపన్నపేట,జనవరి,30,మెదక్ టుడే న్యూస్:సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని పాపన్నపేట కాంగ్రెస్ నాయకులు నరేందర్ గౌడ్ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం పాపన్నపేట గ్రామానికి చెందిన బెస్త శివయ్య,సుంకరి అశోక్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామాల్లో పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నాయకులు ఖలీమ్,కిష్టయ్య,సంగమేశ్వర్, సత్యగౌడ్ తదితరులు ఉన్నారు.