MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 5:17 am Digital Edition : Medak Today

సీఎం ఆర్ ఎఫ్ పేదలకు ఒక వరం

చేగుంట,ఫిబ్రవరి,2,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం బి. కొండాపూర్ గ్రామానికి చెందిన ముటుకుపల్లి రమాదేవి కి దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వచ్చిన 60000 రూపాయల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, చిన్న శివునూరు ఉపసర్పంచ్ బొల్ల ప్రశాంత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,బి.కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్,మహిపాల్ పాల్గొన్నారు.