పాపన్నపేట,డిసెంబర్,9,మెదక్ టుడే న్యూస్// మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని గాందారిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తరపున మంగళవారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ప్రజలను కోరారు. వీరితోపాటు మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.