పాపన్నపేట,డిసెంబర్,26 మెదక్ టుడే న్యూస్:ఘనపూర్ ప్రాజెక్టు రెండవ బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అందొల్ మండల పరిధిలోని మాన్సాన్ పల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ (16) తన మిత్రులతో కలిసి మెదక్ చర్చ్ కు వెళ్లి తిరుగు ప్రయాణం లో ఏడుపాయల వద్ద ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు రెండవ బ్రిడ్జి వద్ద ఈత కొట్టేందుకు మిత్రులతో కలిసి స్నానం ఆచరిస్తుండగా ప్రమాద వశాత్తూ నీటిలో మునిగి పోతుండడంతో అక్కడే ఉన్న మిత్రులు గమనించి ప్రసాద్ ను కాపాడేందుకు వెళ్ళగా భయం తో ప్రసాద్ పెట్టుకోవడంతో కాపాడేందుకు వెళ్ళిన మరో మిత్రుడు నీటిలో మునిగి పోతుండడంతో అక్కడే ఉన్న మత్స్చకారుడు గమనించి ఒకరిని కాపాడగా ప్రసాద్ నీటి లో మునిగి పోయాడు. దీంతో మిత్రులు భయబ్రాంతులై పాపన్న పేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి మిత్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
