MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 5:08 pm Digital Edition : Medak Today

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలికార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయంలో లక్ష బిల్వార్చన నిర్వహించిన ఎమ్మెల్యే..

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి
కార్తీక సోమవారం పురస్కరించుకొని శివాలయంలో లక్ష బిల్వార్చన నిర్వహించిన ఎమ్మెల్యే

పటాన్చెరు నవంబర్ 10
(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన లక్ష బిల్వార్చన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శివయ్య కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.