MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 6:02 am Digital Edition : Medak Today

సామాన్య భక్తులే మాకు వీఐపీలు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

•బీరంగూడ గుట్టపై 24 గంటల్లోగా ఆక్రమణలు తొలగించాలి.

  • అన్ని శాఖల సమన్వయంతో మహాశివరాత్రి జాతరను జయప్రదం చేయాలి.
  • 4 నుండి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం.. పకడ్బందీగా ఏర్పాట్లు.
  • అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆదేశం.

అమీన్‌పూర్,ఫిబ్రవరి,5,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యతదర్శనాల విషయంలో వీఐపీ సంస్కృతికి తావు లేకుండా, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “మా దృష్టిలో సామాన్య భక్తులే వీఐపీలు” అని పేర్కొంటూ, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకలకు సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.దర్శనాల విషయంలో వీఐపీ సంస్కృతికి తావు లేకుండా, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “మా దృష్టిలో సామాన్య భక్తులే వీఐపీలు” అని పేర్కొంటూ, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 18 వరకు జరిగే ఈ వేడుకలకు సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.ఆక్రమణలపై ఉక్కుపాదం
బీరంగూడ గుట్ట పైన ఉన్న అక్రమణలను 24 గంటల్లోగా తొలగించాలని తహసీల్దార్ వెంకటేష్‌ను ఎమ్మెల్యే కఠినంగా ఆదేశించారు. గతంలో చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఆధునిక సాంకేతికత.. నిరంతర నిఘాకంట్రోల్ రూమ్: జాతర సమయంలో మూడు రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండాలి.భద్రత: నిఘా కోసం 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రద్దీ నివారణకు పోలీసు శాఖ ఆధునిక టెక్నాలజీని వాడాలని సూచించారు.
రవాణా: భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.జాతర పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకునేందుకు ఈ నెల 12వ తేదీన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈలోపు అన్ని శాఖలు నిర్దేశించిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్‌పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, తహసీల్దార్ వెంకటేష్, అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, సీఐ నరేష్, ఈవో శశిధర్, అన్ని శాఖల అధికారులు, మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.