MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 10:27 am Digital Edition : Medak Today

రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలి

శిరోధారం… ప్రాణ దారం

మెదక్ డీఎస్ పి ప్రసన్న కుమార్

పాపన్న పేట,జనవరి,13,మెదక్ టుడే న్యూస్:రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలనిమెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అర్రేవ్ అ లీవ్” కార్యక్రమం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రత, నియమాలు, నిబంధనల పై నేటి నుండి పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్న తలంపుతో చేపట్టిన వారోత్సవాల్లో బాగంగా మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రమైన పాపన్న పేట గ్రామ పంచాయతీ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం,అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం,హెల్మెట్,సీటుబెల్టుఉపయోగించకపోవడంవల్లజరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి వాహనదారుడుప్రతిపౌరుడుబాధ్యతగావ్యవహరించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చునని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రాంగ్ రూట్లో నడపకూడదని తెలియజేశారు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్లను ఉప యోగించొద్దని, సెల్ ఫోన్ లోఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. చలికాలంలో మంచు కారణంగా ఓవర్‌టేక్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, మెదక్ రూరల్ సీఐ జార్జ్, పాపన్న పేట ,ఉప సర్పంచ్ సద్దాం హుసేన్, మాజీ ఉప సర్పంచ్ ఖళీం,వార్డు సభ్యులు, పోలీసు సిబ్బంది, వాహన చోదకులు, ప్రజలు పాల్గొన్నారు.