MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:54 am Digital Edition : Shiva Kumar

రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

చేగుంట,మే,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , ఫీల్డ్ స్థాయి ఎన్యూమరేషన్ ప్రక్రియను సమీక్షించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సిబ్బందితో మాట్లాడి, జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి వివరాలను పూర్తిగా సేకరించడం సర్వే సమయంలో వివరాలను సరిగా ధృవీకరించడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.అలాగే, జనగణన కార్యక్రమంలో ఏ అర్హ కుటుంబం కూడా మిగిలిపోకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి, వివిధ అధికారులు పాల్గొన్నారు.