MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:59 am Digital Edition : Medak Today

రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే

పటాన్చెరు డిసెంబర్ 01
మెదక్ టుడేన్యూస్ ప్రతినిధి

ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పాలొత్ రఘు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ ఓ సి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని ఎమ్మెల్యే జిఎంఆర్ సోమవారం పటాన్చెరు లోని తన కార్యాలయంలో రఘు కుటుంబ సభ్యులకు అందజేశారు.