స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు
మెదక్, తూప్రాన్, నర్సాపూర్ పెద్దశంకరం పేట్ మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణా చేయాలియు ఎస్ ఎస్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ మెదక్ జనవరి 31 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా లో విద్యా హక్కు చట్టన్నీ నిర్వర్యం చేస్తు విద్యార్థులను ఒత్తిడులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలనీ యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారుఈ సందర్భంగా ఆయన మెదక్ కలెక్టర్ కార్యాలయంలో డి ఈ ఓ మేడం కి వినతి పత్రం అందజేసీ జగన్ మాట్లాడుతూ..మెదక్ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం 5.30 వరకు స్టడీ అవర్స్ జరుగుతున్నాయని అయన అన్నారు విద్యకు హక్కు చట్టానికి విరుద్ధంగా ప్రైవేట్ స్కూల్స్ రాత్రి 8 గంటల వరకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి 9 గంటల వరకు ప్రైవేట్ స్కూల్స్ బస్సులు రోడ్ల పై నిత్యం కనబడుతున్నాయని ఆయన మండిపడ్డారు వాళ్ల గుర్తింపు కోసం మంచి ర్యాంక్ కోసం రాత్రి వరకు విద్యార్థులను ఒత్తిడి లకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు మండల,జిల్లా విద్యాధికారులు వెంటనే మెదక్, నర్సాపూర్ తూప్రాన్, పెద్దశంకరం పేట్ మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలని డిఇఓ కి వినతి పత్రం జిల్లా నాయకత్వం అందించడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజేష్, నితీన్ పాల్గొన్నారు
