MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 3:46 am Digital Edition : SHIVA KUMAR

వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి..

(స్టేట్ బ్యూరో)రంగారెడ్డి జిల్లా,నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

వీధి కుక్కల దాడిలో చూపు కోల్పోయిన మూడేళ్ల చిన్నారి

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో పాఠశాల నుండి వస్తున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్(3) అనే బాలుడిపై దాడి చేసిన వీధి కుక్కలు.ఈ దాడిలో రిత్విక్ ఎడమ కన్ను తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.బాలుడి కన్ను పరీక్షించి కంటి చూపు పోయినట్టు నిర్ధారించిన వైద్యులు, దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు.రిత్విక్‌పై దాడి చేసిన రోజే వీధి కుక్కలు మరో చిన్నారిపైన కూడా చేశాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్తులు..