MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 1:39 am Digital Edition : Medak Today

రాంపూర్ గ్రామంలో వడగండ్ల వర్షానికి నష్టపోయిన వరి పంటలను సర్వే చేసిన అధికారులు.

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల రాళ్ల వర్షం వలన నష్టపోయిన రైతుల పొలాలను చేగుంట వ్యవసాయ అధికారులు ఈరోజు పరిశీలన చేయడం జరిగినది నష్టపోయిన రైతుల పేర్లు రాసుకోవడం జరిగింది. అనంతరం అధికారులు మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది. పై అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు లు గ్రామ రైతులు పాల్గొనడం జరిగినది.