MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 3:07 am Digital Edition : SHIVA KUMAR

రాంపూర్ గ్రామం లో వడగళ్ల రాళ్లు వర్షం నష్టపోయిన రైతులు.

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అకాల రాళ్ళ వర్షం వలన నష్టపోయిన రైతులు చేగుంట వ్యవసాయ అధికారులు రాంపూర్ గ్రామ సర్పంచ్ కాశబోయిన నాగమణి సుదర్శన్ ఉప్పసర్పంచ్ కాశబోయిన సిద్ధిరాములు పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు వరి పంటలను పరిశీలించినారు. వారు మాట్లాడుతూ అకాల రాళ్ళ వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది.తక్షణమే జిల్లా అధికారులతో మాట్లాడి నష్ట పోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు.