MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 3:03 am Digital Edition : SHIVA KUMAR

రైతులను ఆదుకుంటాం చెరుకు శ్రీనివాస్ రెడ్డి-అకాల వర్షంతో అన్నదాత గుండెకు గుబేలు.

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం మక్కరాజ్ పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం అకాల రాళ్ళ వర్షం వలన నష్ట పోయిన వ్యవసాయ వరి పొలాలను సంబంధిత వ్యవసాయ అధికారులతో, చేగుంట తాసిల్దార్ శివ ప్రసాద్ కలిసి పరిశీలించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారు మాట్లాడుతూ అకాల రాళ్ళ వర్షం వలన రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా చాలా నష్టం జరిగింది.తక్షణమే జిల్లా అధికారులతో మాట్లాడి నష్ట పోయిన ప్రతి రైతు వివరాలు సేకరించాలని వారికి తెలియజేశారు అలాగే జిల్లా ఇంచార్జీ మంత్రి కి సమస్యను తెలియజేసి రైతులను ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు.ఎక్కువగా కౌలు రైతులు తీవ్రంగా నష్టం జరిగింది.పట్టా భూమి యజమానులు మీరు కూడా మానవత్వం చూపించిన మీ కౌలు రైతులకు కౌలు డబ్బులు తీసుకోకుండా వారికి అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు,తోగుట ఎఎంసి ఛైర్మెన్ అమరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పద్మ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సండ్రుగు శ్రీకాంత్,చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్ మొగులయ్య, ఎఎంసి డైరెక్టర్లు,గ్రామ రైతులు,నాయకులు పాల్గొన్నారు