చేగుంట,మే,6,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని మక్క రాజుపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిపించాలని, రైతులు అధైర్య పడవద్దు ప్రతి గింజ కొనుగోలు చేస్తాము అని అన్నారు. ఇక్కడికి వచ్చిన రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని వారు అన్నారు.