లారీల వేట లో ట్రాన్స్పోర్ట్ రెవిన్యూ, పోలీసు సిబ్బంది,ఊపు అందుకున్న వడ్ల కొనుగోలు
చేగుంట,మే,15,మెదక్ టుడే న్యూస్:రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పి పి సి ఎస్ వద్ద నెలకొన్న లారీల కొరత సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈరోజు ఎం వి ఐ శ్రీనివాస్, చేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్,రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సంయుక్తంగా రోడ్లపైకి వచ్చి చర్యలు చేపట్టారు.ఇతర ప్రాంతాలకు వెళ్తున్న లారీలను ఆపి వాటిని పి పి సి ఎస్ కు మళ్లించడం ద్వారా ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయడంతో వడ్ల కొనుగోలు ప్రక్రియ ఊపు అందుకుంది దీంతో రైతులకు ఊరట కలుగుతోంది.