MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 1:24 pm Digital Edition : Medak Today

రైతుభరోసా కు-దరఖాస్తులు ఆహ్వానం.

పాపన్నపేట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన మండల పరిధి లోని రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. ప్రస్తుత యాసంగి 2025 – 26 సీజన్ కు సంబంధించి కొత్త అప్లికేషన్లు,బ్యాంకు వివరాల అప్డేట్ కోసం మార్చి 25 లోపు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలతో పాటు బ్యాంకు అకౌంట్,ఆధార్ కార్డు,ఫోన్ నంబర్ తో దరఖాస్తు సమర్పించాలన్నారు.