మెదక్,డిసెంబర్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలకు మెదక్ జిల్లా క్రీడాకారులు 26,27,28, వ తేదీ లలో ఖమ్మం జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలకు మెదక్ జిల్లా స్థాయిలో పాల్గొని రాష్ట్ర స్థాయికి 12 మంది సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటున్నారని మెదక్ జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా మూడో స్థానం సాధించిందని ఈసారి కూడా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. కోచ్ నర్సింలు,యాకస్వామి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.