MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:49 pm Digital Edition : SHIVA KUMAR

ప్రాథమిక పాఠశాల కర్నాల్ పల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం.

చేగుంట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని ఐదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి మిగతా తరగతులకు పాఠాలను బోధించారు. ఒక్కొక్కరు టీచర్లు తెలుగు ఇంగ్లీషు మ్యాస్ ఇవిఎస్ సబ్జెక్టులను తీసుకొని పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు టీచర్ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాఠాలను బోధించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని,నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, బాధ్యతలు తెలుస్తాయని, పోటీ తత్వం పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం కలుగుతుందని, భవిష్యత్తులో పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు టీ బాలచందర్ సార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా మారిన వీరు పిల్లలకు చక్కగా పాఠాలను బోధించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు టి బాలచందర్ ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు డి ఈ ఓ గా రితిక, ఎం ఈ ఓ గా సహస్ర, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులుగా ధనుష్ కుమార్, ప్రధానోపాధ్యాయులుగా భాను ప్రసాద్,పీఈటిగా మనోజ్, వ్యవహరించారు.వీరితోపాటు రిషిత,పూజ, మనూష,దీక్షిత, సుశాంత్,భావేష్ పాల్గొన్నారు.