MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:36 am Digital Edition : Medak Today

ప్రజల ప్రాణల భద్రతే పోలీస్ శాఖ లక్ష్యంనిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం.

చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి,

చేగుంట,ఏప్రిల్,16,మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డ్రైవర్స్ కు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు.డ్రైవర్ల తో చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి, మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆటో ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇటువంటి పేపర్లు రెన్యువల్ చేసుకోగలరని వారు సూచించారు. అంతేకాకుండా బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని కారు లో వెళ్లేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవాలని వారు అన్నారు పట్ల బాధ్యతాయుత ప్రవర్తనను ప్రజలు అలవాటు చేసుకో వాలనీ అంతేకాకుండా
5 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్డ్ తప్పక ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఏ ఎస్ ఐ సంయోద్దీన్, కానిస్టేబుల్లో రమేష్, బ్రహ్మం,సత్యనారాయణ, పాల్గొన్నారు.