MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 4:08 am Digital Edition : Medak Today

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో భాగంగా ఐకెపి ఆధ్వర్యంలో చిన్న వయసులో వివాహం నష్టాలపై అవగాహన కార్యక్రమం.

చేగుంట,ఏప్రిల్,28,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కిషోర బాలికల (స్నేహ) సంఘాల కిషోర బాలికలకు చిన్న వయసులో వివాహం నష్టాలు పై ఎంపీడీఓ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం- మానవహారం నిర్వహించడం జరిగింది. అక్కడికి వచ్చిన అధికారులు మాట్లాడుతూ,బాల్య వివాహం , బతుకు ఆగం
బాల్య వివాహాలు జరగకుండా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని 1098 చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ పై విస్తృత ప్రచార గ్రామాల్లో చేయాలి
18 సం బాలికల మరియు 21 సం బాలురు వివాహం చేసుకోవడం చట్ట రీత్యా నేరం, వివాహం లో పాల్గొన్న వారి పై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. బాల్య వివాహాలు జరగడానికి కారణాలు తొందర పాటు నిర్ణయాలు, సోషల్ మీడియా ప్రభావం, సహచరులు ఒత్తిడి, కుటుంబములో సంభాషణ లోపం వంటివి . శారీరకంగా మానసికంగా ఎదగని వయసులో వివాహాలు చేయడం ద్వారా గర్భాశయం ఎదగనందున పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నష్టాలు- చదువు మధ్యలో ఆగిపోవడము, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి , కుటుంబములో సమస్యలు, భవిష్యత్తు ప్రమాదంలో పడడం వంటివి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంది చేయాల్సినవి – పేదలతొ మాట్లాడడం, కౌన్సిలింగ్ పొందడం, తొందర పాటు నిర్ణయాలు మానుకోవడo , బాల్య వివాహాలు జరగకుండా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి. 1098 చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ పై విస్తృత ప్రచార గ్రామాల్లో చేయాలి స్నేహ గ్రూప్( కిషోర్ బాలికలు గ్రూప్)- పిల్లలకు సహాయం చేసుకునే వేదికలు గా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ స్రవంతి సతీష్,ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, తాసిల్దార్ శివప్రసాద్,ఐకెపి ఎపిఎం, ఇజిఎస్ ఎపిఓ, హౌసింగ్ ఎఇ, హెల్త్ సూపర్వైజర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ లు, ఐకెపి సీసీలు, చేగుంట జిపి సిబ్బంది విఓఏ లు, అంగన్వాడీ టీచర్లు మరియు కిశోర బాలికలు పాల్గొన్నారు.