చేగుంట,మే,30,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలో అమ్మకు అక్షరమాల(ఉల్లాస్) ర్యాలీ తీయడం, సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. వయోజనులైన మహిళలకు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం ప్రతి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళ కనీసం వారి కుటుంబ సభ్యుల పేర్లు రాయడం చదవడం ఆర్టీసీ బస్సు బోర్డులు చదవడం రాయడం, చిన్న చిన్న పదాలు చదవడం రాయడం చాలా అవసరం ఇందుకోసం ప్రభుత్వం వాలంటీర్లను నియమించి చదువు నేర్పించడం జరుగుతుంది కావున చదువురాని ప్రతి మహిళ ఈ చదవకాశాన్నివినియోగించుకోగలరు అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, ఎంఈఓ నీరజ, ఏపిఎం దుర్గాప్రసాద్, సీసీలు శంకర్, స్వామి, రామస్వామి, అంజ్యానాయక్, శ్వేత, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
