కొల్చారం,మే,25,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మహిళా వారోత్సవాలలో భాగంగా సోమవారం కొల్చారం గ్రామపంచాయతీ ఆవరణలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కిశోర బాలికలు, తల్లులు గర్భిణీ స్త్రీలకు పౌష్కాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం తయారు చేసి చూపించారు. గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్ టెస్టులా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.